Header Banner

ఆన్‌లైన్‌లో ఫర్నిచర్ కొంటున్నారా? హైదరాబాద్ మహిళకు రూ.1.30 లక్షలు టోకరా!

  Mon May 26, 2025 18:12        Business

హైదరాబాద్ నగరంలో ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా, ఫర్నిచర్ కొనుగోలు చేయబోయి ఓ మహిళ రూ.1.30 లక్షలు పోగొట్టుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరగాళ్లు వలలో చిక్కి ఆమె భారీగా నష్టపోయారు.

వివరాల్లోకి వెళితే, నగరానికి చెందిన ఓ మహిళ ఆన్‌లైన్ వేదిక క్వికర్‌లో సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్ అమ్మకానికి సంబంధించిన ప్రకటన చూశారు. ఆ ప్రకటన ఆసక్తికరంగా ఉండటంతో, అందులోని వివరాల ఆధారంగా తన మొబైల్ నంబర్‌ను ఆన్‌లైన్‌లో పంచుకున్నారు. కొద్దిసేపటికే ఒక వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి తాను ఆర్మీ అధికారిని అని పరిచయం చేసుకున్నాడు. ఫర్నిచర్ అమ్ముతున్నానని, ఆర్మీలో ఉండటం వల్ల తక్కువ ధరకే వస్తుందని నమ్మబలికాడు.

ఫర్నిచర్ కావాలంటే ముందుగా 20 శాతం డబ్బు చెల్లించాలని సూచించాడు. అతని మాటలు నమ్మిన మహిళ, అతను చెప్పిన ఖాతాకు డబ్బు బదిలీ చేశారు. ఆ తర్వాత, ఫర్నిచర్‌తో పాటు తక్కువ ధరకే ల్యాప్‌టాప్, ఇతర విలువైన వస్తువులు కూడా అమ్ముతానని నమ్మబలికాడు. వాటికి కూడా డబ్బు చెల్లించాలని, జీఎస్టీ కింద కొంత మొత్తం పంపాలని కోరాడు. ఇలా పలు దఫాలుగా మొత్తం రూ.1.30 లక్షల వరకు వసూలు చేశాడు.

డబ్బులు చెల్లించిన తర్వాత కూడా వస్తువులు డెలివరీ కాకపోవడంతో, అవతలి వ్యక్తి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో తాను మోసపోయానని బాధితురాలు గ్రహించారు. వెంటనే ఆమె హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. ఆన్‌లైన్ కొనుగోళ్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్త వహించాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: వాట్సాప్‌లో రేషన్ కార్డు సేవలు..! ఈ నంబర్‌కు మెసేజ్ చేస్తే చాలు..!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


కరోనా కొత్త వేరియంట్లు భారత్‌లోకి.. ! చిన్నారులు, వృద్ధులు రిస్క్‌లో..!


కేంద్రం వాహనదారులకు శుభవార్త! జాతీయ రహదారులపై టోల్ కొత్త పథకం!


కేసీఆర్ కు కవితకు మధ్య గ్యాప్ వెనుక కారణం ఇదే! చేసింది అంతా ఆయనే!


ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీయే సీఎంలు, డిప్యూటీ సీఎంల భేటీ.. చేసిన తీర్మానాలు ఇవే!


జంట హత్యల కేసులో ఊహించని ట్విస్ట్.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రదర్స్ పై కేసు నమోదు!


రెండు రోజుల పోలీస్‌ కస్టడీకి పీఎస్ఆర్‌, మధు! ఆంజనేయులపై ప్రశ్నల వర్షం..


ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేసిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఇవాళ మన్ కీ బాత్ కార్యక్రమం!


వైసీపీకి మరో భారీ షాక్! ఏపీ పోలీసుల అదుపులో మాజీ మంత్రి!

ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు.. ఆస్తి అడిగామా?
నిరూపించండి.. మనోజ్ ఎమోషనల్!


నిరుద్యోగులకు గుడ్ న్యూస్! నెలకు 2 లక్షల జీతంతో.. భారీ నోటిఫికేషన్!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #OnlineFraud #HyderabadNews #FurnitureScam #CyberCrime #OnlineShoppingAlert #ScamAlert